News February 10, 2025

తాళ్లరేవు: 119 మంది అరెస్ట్.. రూ.9లక్షలు స్వాధీనం

image

తాళ్లరేవు మండలం వేమవరం సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్న శిబిరంపై ఆదివారం రాత్రి కోరంగి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి బృందం దాడులు చేసింది. కోడిపందేలు నిర్వహిస్తున్న 119 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం, పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News September 15, 2025

రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

image

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.

News September 15, 2025

మంచిర్యాలలో కలకలం రేపిన జేఎల్ఏం ఆత్మహత్యాయత్నం

image

మంచిర్యాలలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం భవనం పైనుంచి దూకి జూనియర్ లైన్ మెన్ బూసి రాజు ఆత్మహత్యాయత్నం చేయడం సోమవారం కలకలం రేపింది. చెన్నూర్ లైన్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన తన తండ్రి వందనం మరణించగా.. రాజుకు ఉద్యోగం లభించింది. తన తల్లి రోజామణికి పెన్షన్, హెల్త్ కార్డు మంజూరులో జాప్యం చేస్తున్నారని రాజు తెలిపారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.

News September 15, 2025

గద్వాల: రేపు ఈవీఎంల తనిఖీలు

image

ఈవీఎంలను మంగళవారం తనిఖీ చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు క్యాంప్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఈ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.