News November 16, 2024

తిమ్మాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తాడూరి వెంకట్ రెడ్డి నడుపుతున్న కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు బిహారి కూలీలను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకటరెడ్డికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 8, 2026

కరీంనగర్‌లో రేపు 2కే రన్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

News March 8, 2026

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ప్రజావాణి కార్యక్రమానికి, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ స్థానంలో ఇతర అధికారిని డిప్యూట్ చేయాలని, ప్రజల నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు.

News March 7, 2026

KNR: తహశీల్దార్‌పై ఏసీబీ పంజా.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

image

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.