News August 8, 2025
తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు ఆర్బిట్రేషన్ నిర్వహణ

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163 నిర్మాణంలో భూమి కోల్పోయిన సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామ భూ నిర్వాసిత రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు శుక్రవారం ఆర్బిట్రేషన్ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఈ ఆర్బిట్రేషన్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహశీల్దార్లు రాజ్ కుమార్, నేషన్ హైవే సైట్ ఇంజినీర్ ఈశ్వర్ రైతులు పాల్గొన్నారు.
Similar News
News August 9, 2025
రాయపర్తిలో యూరియా బస్తాల కోసం పాదరక్షల క్యూ

దేశానికి తిండి పెట్టడం కోసం ఆరుగాలం శ్రమించే అన్నదాతలు యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగులో కీలకమైన యూరియా కోసం రైతన్నలు చెప్పరాని తిప్పలు ఎదుర్కొంటున్నారు. రాయపర్తిలోని PACSకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో మండలంలోని రైతులంతా పెద్ద ఎత్తున శుక్రవారం వేకువజాము నుంచే బారులు తీరారు. ఎండలో లైన్లో నిలబడలేక సాయంత్రం వేళ చెప్పులను క్యూగా పెట్టి యూరియా బస్తాలు తీసుకున్నారు.
News August 8, 2025
డా.ప్రత్యూష ఆత్మహత్య కేసులో సృజన్కు బిగ్ షాక్

డా.ప్రత్యూష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మృతురాలి భర్త డా.సృజన్కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సస్పెన్షన్ వేటు వేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులపై BNS యాక్ట్ 108, 115(2), 292, 351(2), 85 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
News August 8, 2025
వరంగల్ జిల్లాలో దంచికొట్టిన వాన

వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రంతా వాన దంచికొట్టింది. జిల్లాలో 621.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ మండలాల్లో భారీ వర్షం కురవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వరంగల్లో 70.9 మి.మీ, ఖిలావరంగల్ లో 65.3 మి.మీ, గీసుగొండలో 92.9 మి.మీల వాన కురిసింది. కాగా వరంగల్, హనుమకొండ నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.