News October 15, 2025

తిరుచానూరులో మహిళా జమేదార్‌పై చర్యలేవి..?

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భద్రత కల్పించాల్సిన సిబ్బంది దురుసు ప్రవర్తన భక్తుల పాలిట శాపంగా మారింది. మంగళవారం ఓ మహిళా విజిలెన్స్ జమేధార్ భక్తురాలిపై చేయి చేసుకుంది. గతంలో కూడా ఆమె ఓ దివ్యాంగుడి పట్ల దురుసుగా ప్రవర్తించారట. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News

News October 15, 2025

వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సక్సెస్: కలెక్టర్

image

14, 15వ తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విజయవంతమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. 150 మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.

News October 15, 2025

CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

image

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.

News October 15, 2025

గద్వాల: బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశం

image

జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో బీజేపీ జిల్లా మోర్చా నాయకుల సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో, ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్, సుకన్య సమృద్ధి యోజన, పీఎం మాతృ వందన యోజన వంటి పథకాలను మోర్చా నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.