News September 21, 2024

తిరుపతిలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

image

తిరుపతి పట్టణం కటిక రంగడు వీధిలోని చిల్లర దుకాణంలో గంజాయి చాక్లెట్లను వెస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3,200 గ్రాముల గంజాయి మిశ్రమం కలిగిన రూ.86 వేలు విలువచేసే చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు బవర్ లాల్ తులసీరామ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.

Similar News

News November 3, 2025

మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

image

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.

News November 3, 2025

చిత్తూరు: ఆధార్ అప్‌ డేట్ గడువు పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.

News November 3, 2025

నాన్న సారీ అంటూ యువకుడి ఆత్మహత్య

image

పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి.అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్టోబర్ 24 నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినితో అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నచ్చిన అమ్మాయి దూరమైందని డిప్రెషన్‌కు గురైన అరవింద్ నాన్న సారీ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.