News September 21, 2024

తిరుపతిలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

image

తిరుపతి పట్టణం కటిక రంగడు వీధిలోని చిల్లర దుకాణంలో గంజాయి చాక్లెట్లను వెస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3,200 గ్రాముల గంజాయి మిశ్రమం కలిగిన రూ.86 వేలు విలువచేసే చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు బవర్ లాల్ తులసీరామ్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.

Similar News

News September 21, 2024

విద్యుత్ షాక్ తగిలి రైల్వే ఉద్యోగి మృతి

image

రైల్వే స్టేషన్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భరత్ అనే ఉద్యోగి విద్యుత్ తీగల మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హై టెన్షన్ తీగలు తగిలి కుప్పకూలాడు. దీంతో తోటి సిబ్బంది హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News September 21, 2024

తిరుమల బాలాజీ నగర్ లో కార్డన్ సర్చ్

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న క్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్థానికులు నివసించే తిరుమల బాలాజీ నాగర్ లో భద్రతా బలగాలతో కార్డన్ సర్చ్ నిర్వహించారు. స్థానికుల వివరాలతో పాటు ఆధారాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.

News September 21, 2024

తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

పెట్రోల్ బంకు క్లియరెన్స్‌లో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిను సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణలో నిజమని తేలడంతో ఆయనపై వేటు వేసింది.