News March 18, 2025
తిరుపతిలో దాడిపై స్పందించిన ఈసీ

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియలో హింస జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఎట్టకేలకు స్పందించింది. ఎంపీ గురుమూర్తి చేసిన ఆరోపణలపై తక్షణ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఈసీ ముఖ్య కార్యదర్శి కేఆర్బీ హెచ్ఎన్ చక్రవర్తి లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా చట్ట ఉల్లంఘనలు జరిగాయని, ప్రజాప్రతినిధుల హక్కులను అణచివేశారని ఈసీకి ఎంపీ ఫిర్యాదు చేశారు.
Similar News
News March 1, 2026
యాదాద్రిలో నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభంలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో, నేటి నుంచి నిత్య ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. 11రోజుల వేడుకల అనంతరం నిత్య సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, జోడు సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఉత్సవాల కారణంగా నిలిపివేసిన ఈ సేవలను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల ముగింపుతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
News March 1, 2026
అన్నమయ్య: ప్రేమ పెళ్లి.. PSలో కౌన్సిలింగ్

అన్నమయ్య జిల్లా రామసముద్రం (M) దొడ్డిపల్లికి చెందిన సంతోశ్, భవాని అనే ప్రేమ జంట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో చర్చించి వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం జంటను అబ్బాయి తరఫు బంధువులకు అప్పగించారు.
News March 1, 2026
సత్యసాయి: ఆమెది హత్యా? ఆత్మహత్యా?

పుట్టపర్తిలోని పెడపల్లిలో వివాహిత చంద్రకళ (22) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతి అనుమానస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం భర్తే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పుట్టపర్తి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు వర్షిత, మోక్షిత ఇరువురు పిల్లలు ఉన్నారు.


