News December 13, 2025

తిరుపతిలో మరో 4 స్టార్ హోటల్

image

తిరుపతిలో ‘హిల్‌టన్ గార్డెన్ ఇన్’ పేరిట 4-స్టార్ హోటల్ నిర్మించనున్నారు. నాంది హోటల్స్ సంస్థ రూ.149.65 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ చేపట్టనుంది. 222 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీకి 10 ఏళ్లు 100% నికర SGST రీఫండ్‌, స్థిర మూలధన పెట్టుబడిలో 10% (గరిష్ఠంగా ₹10 కోట్లు) ప్రోత్సాహకం అందించనున్నారు. స్టాంప్ డ్యూటీ, విద్యుత్ డ్యూటీ రీఫండ్‌ ఇస్తారు. అక్కారంపల్లిలో దీనిని నిర్మిస్తారు.

Similar News

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.

News December 15, 2025

ధారూర్‌ మండలంలోని సర్పంచ్‌‌లు వీళ్లే..

image

ధారూర్‌ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అల్లాపూర్-విజయలక్ష్మీ
తరిగొప్పుల-అంజిలయ్య
అంతారం-సువర్ణ
అల్లీపూర్-వీరేశం
చింతకుంట-చంద్రయ్య
కెరెల్లీ-పద్మమ్మ
కొండాపూర్ కుర్ద్-స్వాత

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.