News April 12, 2025

తిరుపతిలో 14న గ్రీవెన్స్ రద్దు 

image

ఈనెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాలకు రావద్దని ఆయన సూచించారు. 

Similar News

News November 2, 2025

T20Iలకు కేన్ మామ గుడ్ బై

image

NZ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్సన్ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011లో T20ల్లో డెబ్యూ చేసిన ఆయన 93 మ్యాచుల్లో 2,575 రన్స్ చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 95. కివీస్ తరఫున 75 మ్యాచులకు కెప్టెన్సీ చేశారు. షార్టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు తనతో పాటు జట్టుకూ ఇదే సరైన సమయమని కేన్ తెలిపారు. దీంతో రానున్న T20WC ప్రిపరేషన్‌కు జట్టుకు క్లారిటీ వస్తుందన్నారు.

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

పాలమూరు: చెప్పుల కోసం పోతే.. ఊపిరి పోయింది!

image

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లికి చెందిన మల్కేడి శంకర్‌జీ (45) ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. శనివారం ఆయన బైక్‌పై దాసర్లపల్లి నుంచి మామిళ్లపల్లికి వెళ్తుండగా, చిలుకల వాగు వంతెన దాటే క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, తన పాదరక్షలు నీటిలో కొట్టుకుపోవడంతో, వాటిని తీసే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు.