News March 4, 2026
తిరుపతిలో 20 ఏళ్ల CM కల.. తీరేనా?

రుయాతోపాటు TTD పరిధిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను ఓకే గొడుగు కిందకు తేవడం CM చంద్రబాబు ఆలోచన. దీంతో యాత్రికులు, స్థానికులకు మెరుగైన వైద్యం అందిచవచ్చు. 20 ఏళ్లుగా ఈ ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. TTD మాజీ EO అనిల్ ఇందుకు వ్యతిరేకత చూపినట్లు సమాచారం. రుయా సర్వీస్ రూల్స్, TTD సర్వీస్ రూల్స్ వేరు కావడం, సాంకేతిక, పాలన పరమైన అంశాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోసారి CM దీనిని తెరపైకి తెచ్చారు.
Similar News
News March 9, 2026
PPM: కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 95 అర్జీలు

పార్వతీపురం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 95 అర్జీలను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు అర్జీలను అందజేశారు. కలెక్టర్ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, DRO హేమలత ఉన్నారు.
News March 9, 2026
శ్రీలంక కొత్త కోచ్గా గ్యారీ కిర్స్టెన్

శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టెన్ నియమితులయ్యారు. APR 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కిర్స్టెన్ కోచ్గా ఉన్నారు. 2011-13 వరకు సౌతాఫ్రికా కోచ్గా పనిచేశారు. ఆ సమయంలో (2013) సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లలో ఐసీసీ నం.1 ర్యాంక్ సాధించింది. కాగా T20WC-2026లో శ్రీలంక సూపర్-8 దశలో ఓడటంతో కోచ్ జయసూర్య రాజీనామా చేశారు.
News March 9, 2026
ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పిన నెల్లూరు కమిషనర్

నెల్లూరు నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం సమస్యల పరిష్కార వేదిక జరిగింది. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వైఓ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరూ 300 చ.అ ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


