News March 21, 2025
తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
Similar News
News March 21, 2025
MBNR: ప్రభుత్వ ఆస్తులను టచ్ చేస్తే కఠిన చర్యలు: DE

చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే చట్టపరమైన కఠినచర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ DE మనోహర్ హెచ్చరించారు. ఏనుగొండలోని కొర్రంగడ్డ కుంటను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందడంతో శుక్రవారం అధికారులతో కలిసి కుంటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి చెందిన ఆస్తులను ఆక్రమణలకు గురిచేస్తే ఎంతటి వారైనా సహించబోమని మనోహర్ తెలిపారు.
News March 21, 2025
చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది: అంబటి

AP: ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే YCP MLAలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. స్కిట్స్లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, CBN శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. YSR స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.
News March 21, 2025
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి: గద్వాల కలెక్టర్

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 20న జోగులాంబ గద్వాల జిల్లా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులు ఈరోజు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సంతోష్ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నియామకం పొందిన అభ్యర్థులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.