News April 22, 2024
తిరుపతి: అనుమానంతో భార్య గొంతు నులిమి హత్య

భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన వరదయ్యపాళెంలో జరిగింది. మండలంలోని సాధనవారిపాళెంనకు చెందిన అంజలి(23)కి తూకివాకంకు చెందిన రాజశేఖర్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే భర్త అనుమానంతో వేధిస్తుండడంతో అంజలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో19వ తేదీన అత్తవారింటికెళ్లి అక్రమసంబంధం ఉందంటూ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమై ఆవేశంతో రాజశేఖర్ తన భార్య గొంతు నులమడంతో మృతి చెందింది.
Similar News
News April 21, 2025
చిత్తూరు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,478 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-578 ➤ BC-A:111 ➤ BC-B:139
➤ BC-C:19 ➤ BC-D:102 ➤ BC-E:53
➤ SC- గ్రేడ్1:21 ➤ SC-గ్రేడ్2:94 ➤ SC-గ్రేడ్3:112
➤ ST:95 ➤ EWS:138
➤ PH-విజువల్:1 ➤ PH- హియర్:10
➤ ట్రైబల్ వెల్ఫేర్ :5
News April 21, 2025
మే 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 6 నుంచి ప్రారంభం కానుంది. 6న చాటింపు వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7న బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర జరగనుంది. 14న ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర ముగుస్తుంది. పుష్ప-2లోనూ ఈ జాతర ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే
News April 21, 2025
కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించడం లక్ష్యంగా కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10.గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకొవాలి