News March 24, 2024

తిరుపతి: ఆయన తప్ప.. ఎవరైనా OK!

image

జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారు. తిరుపతి సీటుపైనే స్తబ్దత నెలకొంది. చిత్తూరు MLA శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా ప్రతిపాదించగా జనసేనతో పాటు TDP నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నిన్న జనసేన నాయకులు నాగబాబును కలిసి చర్చించారు. లోకల్‌గా ఉన్న తనతో పాటు TDPలోని ఇద్దరు నేతల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని తిరుపతిలో కీలకంగా ఉన్న జనసేన నాయకుడు చెప్పినట్లు సమాచారం.

Similar News

News September 27, 2025

గర్భిణీల నమోదు 100% జరగాలి: చిత్తూరు కలెక్టర్

image

PHCలలో గర్భిణీల నమోదు 100% జరగాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ నమోదు కాకాపోతే వాటికి రాతపూర్వక కారణాలను ఇవ్వాలన్నారు. వైద్యులు రోజువారి మానిటర్ చేయాలన్నారు. పొరపాటు ఉంటే వైద్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాపింగ్ పైన ఇబ్బందులు ఉంటే సరి చూసుకోవాలన్నారు.

News September 26, 2025

పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలి: JC

image

ప్రతి వారం బాలల సంరక్షణ కేంద్రాలలో పిల్లల ఆరోగ్యంపై తనిఖీలు నిర్వహించాలని చిత్తూరు జేసీ విద్యాధరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీలకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పిల్లల ఆరోగ్య సమస్యలను డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చికిత్స అందించాలన్నారు.

News September 26, 2025

చిత్తూరు జిల్లాలో వర్కర్లకు వేతనాలు పెంపు

image

జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR, మజ్దూర్ వర్కర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కనీస వేతనాలు పెంచుతున్నట్టు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపునకు సంబంధించి కమిటీ సభ్యుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాలను పెంచినట్లు ఆయన స్పష్టం చేశారు.