News January 18, 2025
తిరుపతి: ఎంత ఘోరమో కదా..!

చిత్తూరు గంగాసాగరం రోడ్డు ప్రమాదంలో అనేక విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలోని సప్తగిరి నగర్కు చెందిన పొన్ను చంద్ర(38) తల్లితో కలిసి మధురైలోని ఆసుపత్రికి బయల్దేరారు. తల్లి కింద సీటులో కూర్చోగా.. చంద్ర పైన సీటులో నిద్రించారు. బస్ బోల్తా పడినప్పుడు ఓ కరెంట్ స్తంభం బస్లోకి దూసుకొచ్చింది. దీంతో చంద్ర చనిపోగా.. తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు.
Similar News
News February 6, 2026
పుంగనూరు TDP ఇన్ఛార్జ్ మార్పుపై కసరత్తు..?

పుంగనూరులో పెద్దిరెడ్డిని ఎదుర్కోవడంలో TDP ఇన్ఛార్జ్ చల్లా బాబు విఫలం అవుతున్నారని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. కూటమి అధికారంలో ఉన్నా ఇక్కడ మాత్రం YCPదే పవరంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం వద్ద వాపోయారట. పెద్దిరెడ్డితో చల్లా లోపాయికారి ఒప్పందాలతో క్యాడర్ నష్టపోతుందని, ఇందుకు చెక్ పెట్టాలని ఓవర్గం హైకమాండ్ను కోరినట్లు సమాచారం. అధిష్ఠానం సైతం ఇన్ఛార్జ్ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
News February 6, 2026
చిత్తూరు: హస్తం పార్టీ మళ్లీ పుంజుకునేనా.?

జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ పుంజుకునే అవకాశాలు తక్కువే. కేంద్ర మాజీ మంత్రి చింతా, స్థానిక నేతలు ప్రజల్లో అడపాదడపా తిరుగుతున్నా ఆ ప్రభావం కనిపించడం లేదు. రెండు రోజుల నుంచి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తిరుగుతున్నారు. రఘువీరారెడ్డి వంటి నేతలు నాయకులలో నూతనోత్సాహం నింపేలా ప్రయత్నిస్తున్నారు. మరి మళ్లీ హస్తం పార్టీ జెండా ఎగురుతుందా.?
News February 6, 2026
చిత్తూరు: హజ్ యాత్రికులకు రేపు వైద్య పరీక్షలు

హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు శనివారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖాజీముల్ హుజా జ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడంతో పాటు వ్యాక్సిన్ వేస్తారన్నారు.


