News March 24, 2024

తిరుపతి ఎంపీగా గూడూరు MLA..?

image

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీలో చేరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఆయనకు సీటు నిరాకరించింది. బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు రేసులో ఉన్నారు.

Similar News

News January 3, 2026

చిత్తూరు: పరీక్ష కేంద్రాలు ఇవే

image

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఓ మోహన్ కుమార్ శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.1. ఆర్‌వీఎస్ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, 2. పలమనేరు మదర్ తెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, 3. చిత్తూరు మురకంబట్టులోని శ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 4. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News January 3, 2026

మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల మద్యం తాగేశారు.!

image

చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31 తేదీలతో పాటు జనవరి ఒకటిన మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ మూడ్రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన.. 5738 కేసుల బీర్లు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 14,130 కేసులు అమ్ముడయ్యాయి.

News January 3, 2026

చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

image

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.