News August 23, 2025
తిరుపతి: ఒకే వ్యక్తికి 5 ప్రభుత్వ ఉద్యోగాలు

పుత్తూరుకు చెందిన వ్యక్తి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గజేంద్ర, రత్న దంపతులకు మహేష్, వినోద్, మోహన్ ముగ్గురు సంతానం. చిన్నతనంలో భర్తను కోల్పోయిన ఆమె తన తల్లి వద్ద ముగ్గురిని వదిలి కువైట్కు జీవనోపాధి కోసం వెళ్లింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన మోహన్ SA సోషల్లో 23వ ర్యాంకు, తెలుగులో 27, SGTలో 26, TGT లో 35వ ర్యాంకు సాధించారు. ఇటీవల వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో సైతం 3వ ర్యాంకు వచ్చింది.
Similar News
News August 24, 2025
రాహుల్కు, కాంగ్రెస్కు బిహార్లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.
News August 24, 2025
తాంసిలో వైభవంగా ఎద్దుల జాతర.. హాజరైన కలెక్టర్, ఎస్పీ

తాంసి మండల కేంద్రంలో పొలాల అమావాస్యను పురస్కరించుకొని శనివారం ఎద్దుల జాతర వైభవంగా జరిగింది. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు కలిసి బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి, గ్రామంలో ఊరేగించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
News August 24, 2025
మెదక్: ‘ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి’

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ ఫోన్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసిన ఫిర్యాదులు, సూచనల మేరకు పని చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఆమె పేర్కొన్నారు.