News March 19, 2025

తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

image

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.

Similar News

News March 20, 2025

గద్వాల: 144 సెక్షన్ అమలు 

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163, BNSS అమలులో ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాల్లో 717 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 20, 2025

విశాఖలో ప్ర‌త్యేక‌ ఆధార్ క్యాంపులు

image

విశాఖ జిల్లాలో గురువారం నుంచి ప్ర‌త్యేక ఆధార్ క్యాంపులు నిర్వ‌హించనున్నట్లు కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ బుధవారం తెలిపారు. రేపటి నుంచి మార్చి 22 వరకు, మార్చి 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఆధార్ క్యాంపుల నిర్వహణపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారులను ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆధార్ సేవలు అందుతాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!