News March 20, 2025

తిరుపతి: కప్ కైవసం చేసుకున్న పోలీస్ జట్టు

image

తిరుపతి తారకరామా స్టేడియంలో జరిగిన మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ T-20 టోర్నమెంట్‌లో అమర్ రాజా టీంపై పోలీస్ జట్టు ఘనవిజయం సాధించింది. క్రికెట్ ట్రోర్నమెంట్ లో రాఘవులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. ఆరు మ్యాచ్‌లలో 572 పరుగులు సాధించి అతను  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు వారిని అభినందించారు.

Similar News

News February 24, 2026

‘టెర్రర్’ ఆరోపణలు.. టెలిగ్రామ్ ఫౌండర్‌పై రష్యా దర్యాప్తు

image

టెర్రరిజం యాక్టివిటీలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో టెలిగ్రామ్ ఫౌండర్‌ పావెల్ దురోవ్‌పై రష్యా దర్యాప్తు ప్రారంభించింది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ పత్రిక Rossiyskaya Gazeta తెలిపింది. వెస్టర్న్, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌తో యాప్ రాజీపడినట్లు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ రిపోర్టు ఇచ్చిందని పేర్కొంది. రూల్స్ ఉల్లంఘిస్తున్న టెలిగ్రామ్‌ను స్లోడౌన్ చేస్తామని ఇటీవల రష్యా హెచ్చరించింది.

News February 24, 2026

KKD: 19,593 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్!

image

KKD జిల్లాలో PM సూర్య ఘర్ పథకం కింద SC, ST వర్గాల గృహాలపై సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశించారు. మంగళవారం KKD కలెక్టరేట్ నుంచి APEPDCL అధికారులు, వెండార్లతో దీనిపై సమీక్షించారు. జిల్లాలో 19,593 మంది SC, STల గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన ప్యానెల్స్ అమర్చాలని అధికారులకు సూచించారు.

News February 24, 2026

బ్రహ్మోత్సవాలను పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్

image

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ఠంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో బ్రహ్మోత్సవాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.