News June 26, 2024
తిరుపతి: కాకినాడ, విశాఖ రైళ్ల రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719355156777-normal-WIFI.webp)
విజయవాడ డివిజన్ లోని నిడదవోలు-కడియం సెక్షన్లో నిర్వహణ పనుల కారణంగా తిరుపతి నుంచి రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి-కాకినాడ టౌన్ (17249) రైలును ఆగస్టు 10,కాకినాడ టౌన్-తిరుపతి (17250) రైలును ఆగస్టు 11,తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ (22708) ను ఆగస్టు 9వరకు, విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ (22707) రైలును 10వ తేదీ వరకు రద్దు చేశారు.
Similar News
News June 29, 2024
తిరుపతిలో భార్యాభర్తకు జైలుశిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719586166859-normal-WIFI.webp)
చీటింగ్ కేసులో తిరుపతికి చెందిన భార్యాభర్తలకు జైలుశిక్ష పడింది. ఫిర్యాది తరఫు న్యాయవాది జి.వెంకట కుమార్ వివరాల మేరకు.. నగరానికి చెందిన కె.శ్రీనివాసులు, కె.ఓంకార లక్ష్మి ఒకరికి అప్పు తీర్చేందుకు భార్య పేరుతో ఉన్న చెక్పై భర్త సంతకం పెట్టారు. దీంతో కేసు నమోదైంది. ఒక్కొక్కరికీ మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి 3వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి ఎం.సంధ్యారాణి తీర్పు చెప్పారు.
News June 29, 2024
CTR: మామిడి రైతులకు సూచనలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719586944729-normal-WIFI.webp)
ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.
News June 29, 2024
తిరుమల: ఘాట్ రోడ్లోకి వచ్చిన ఏనుగులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719588869390-normal-WIFI.webp)
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.