News March 21, 2024
తిరుపతి: కానిస్టేబుల్ సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710981795218-normal-WIFI.webp)
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియమాలను ఉల్లంఘించరాదని ఎస్పీ హెచ్చరించారు. నారా భువనేశ్వరిని కలవడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Similar News
News July 8, 2024
పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416685517-normal-WIFI.webp)
వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.
News July 8, 2024
నగరి : YSRకు నివాళులు అర్పించిన ఆర్కే రోజా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720411424939-normal-WIFI.webp)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రాష్ట్ర చరిత్రలోనే 108 అంబులెన్స్ ప్రవేశపెట్టి రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమందికి పునఃజన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.
News July 8, 2024
తిరుపతి: డిప్లొమా కోర్సులకు దరఖాస్తు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720392922784-normal-WIFI.webp)
ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో అనిమల్ హస్బెండరీ (ఏహెచ్) పాలిటెక్నిక్ డిప్లొమా రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సుకు ఆన్ లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెంగల్రాయులు ఒక ప్రకటనలో తెలిపారు. SSC లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు సోమవారం నుంచి వర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.