News April 20, 2024

తిరుపతి గంగమ్మ జాతర తేదీల మార్పు

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణ తేదీలు మారాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 7వ తేదీ నుంచి 15 వరకు జరగాల్సి ఉంది. మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంది. అదే సమయంలో జాతర నిర్వహిస్తే బందోబస్తు సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంతో 14వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు జాతర చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆలయం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

Similar News

News October 9, 2025

పాలీహౌస్ వ్యవసాయంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

పాలీహౌస్ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కుప్పంలో ఉద్యానవన శాఖ సీడ్ ఏపీ ఆధ్వర్యంలో పాలీహౌస్ సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం రైతులతో సమావేశం అయి వారికి పలు సూచనలు ఇచ్చారు.

News October 9, 2025

చిత్తూరు: రూ. 346 కోట్ల రుణాలు పంపిణీ

image

స్త్రీనిధి ద్వారా రూ.346 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలతో జిల్లా ప్రగతిపై ఆమె సమీక్షించారు. ‘ఉన్నతి’ ద్వారా రూ.20 కోట్లు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించామని, ఈ అంశాలను ప్రజల్లో తీసుకెళ్లి వారి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు.

News October 8, 2025

పడిపోయిన అరటి ధరలు.. నష్టాల్లో రైతులు

image

అరటి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో SRపురం, పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో రైతులు విరివిగా అరటి పంటను సాగు చేశారు. ధరలు లేకపోవడంతో పలువురు రైతులు పంటను తోటలోని వదిలేస్తున్నారు. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల కోరుతున్నారు.