News February 25, 2026
తిరుపతి: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

మార్కెట్లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News February 26, 2026
నిర్మల్: పుష్కరాలకు కావల్సిన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
News February 26, 2026
రష్మిక-విజయ్ పెళ్లి ఫొటోలు

విజయ్ దేవరకొండ-రష్మిక ఇవాళ ఉదయం గ్రాండ్గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి ఫొటోలను రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ‘నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ సైతం పెళ్లి ఫొటోలను SMలో షేర్ చేశారు. దీంతో అభిమానులు విరోష్ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
News February 26, 2026
విశాఖ :రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.05 కోట్లు అందజేత

రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్&రన్లో చనిపోయిన ఎలమంచిలి రాజు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, దువ్వాడకు చెందిన అను, తరిణి లక్ష్మి, మెంటాడకు చెందిన సురేశ్ యాక్సిడెంట్లో గాయపడడంతో వారి ఖాతాలో రూ.50వేలు చొప్పున జమ చేశామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో హిట్ & రన్ కేసుల్లో 129 మంది బాధితులకు మొత్తం రూ.1.05 కోట్లు అందించామన్నారు.


