News April 17, 2024
తిరుపతి జిల్లాలో ఎన్ని ఎపిక్ కార్డులు ప్రింట్ అయ్యాయో తెలుసా

జిల్లాలో 2023 జనవరి 6 నుండి 2024 మార్చి 30 వరకు మొత్తం 337130 ఎపిక్ కార్డులను జనరేట్ చేయగా 314710 ప్రింట్ చేసి జిల్లా కలెక్టర్ నుంచి పోస్టల్ శాఖకు పంపారు. పోస్టల్ ద్వారా 265823 ఓటర్లకు పంపిణీ చేయగా అందులో 12875 రిటర్న్ రావడంతో బిఎల్ఓల ద్వారా 10439 ఓటర్ కార్డులు పంపిణీ చేసారు. బిఎల్ఓ వద్ద 2436, పోస్టల్ శాఖ వద్ద 60,868 ఓటర్ కార్డులు పంపిణీ కి సిద్ధంగా ఉన్నాయి.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
సివిల్స్లో మెరిసిన పలమనేరు వాసి

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.