News August 7, 2024

తిరుపతి జిల్లాలో చిరుత సంచారం?

image

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరమాలలో అడవి జంతువు సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేషమ్మ సోమవారం రాత్రి తన పశువులను పొలాల సమీపంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం పాలు పితికేందుకు వెళ్లగా తాడుకు కట్టేసిన దూడను చంపి తినడం గుర్తించారు. అటవీ బీట్ అధికారి కిషోర్ కుమార్ జంతువు పాద ముద్రలు సేకరించారు. దాడికి పాల్పడింది చిరుతా? లేదా రేసుకుక్కలా? అని తేలాల్సి ఉంది.

Similar News

News February 19, 2026

చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

image

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.

News February 19, 2026

చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

image

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

News February 19, 2026

చిత్తూరు: మామిడి రైతులకు రూ.1కే.!

image

మామిడి కవర్లను 50% సబ్సిడీపై అందించనున్నట్లు చంద్రగిరి HO శైలజ గురువారం తెలిపారు. రైతుకు గరిష్ఠంగా 1హెక్టారుకు 15 వేల కవర్లు ఇస్తామని, ఒక కవరు రూ.2లు కాగా, రైతు రూ.1 చెల్లించాలన్నారు. చంద్రగిరి, పాకాల (M) లోని ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు, పాస్ బుక్, ఫొటో‌తో రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కవర్ల వలన పంటకు పురుగుల దెబ్బ, వ్యాధులు తగ్గి నాణ్యమైన దిగుబడి వస్తుందని HO తెలిపారు.