News December 22, 2025

తిరుపతి జిల్లాలో తొలిసారి..!

image

TDP తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి నియమితులైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అధ్యక్షురాలిగా ఎంపిక కాలేదు. తొలిసారి పనబాకకు ఆ అవకాశం దక్కింది. పార్లమెంట్ పరిధిలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు SC రిజ్వర్ నియోజకవర్గాలు. కేంద్ర మంత్రిగానూ పనిచేయడంతో SC సామాజిక వర్గానికి చెందిన ఆమెకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.

Similar News

News December 30, 2025

రామగుండం: 12.30AMలోపు వేడుకలు ముగించుకోవాలి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను 12:30AMలోపు ముగించుకోవాలని సీపీ అంబర్‌ కిషోర్‌ తెలిపారు. 10PM నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్టానికి లోబడి ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

News December 30, 2025

అల్లూరి: ‘నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు’

image

2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అల్లూరి జిల్లా పోలీసు శాఖ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల ప్రదర్శనలు, బాణసంచా, డ్రగ్స్ వినియోగం నిషేధమని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బైక్, కారు రేసింగ్‌లు, అతివేగం నిషేధమన్నారు. డీజే సౌండ్‌పై పరిమితులు విధించామని తెలిపారు.

News December 30, 2025

హరీశ్ రావు ఆరోపణలకు ఉత్తమ్ కౌంటర్

image

TG: బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ <<18714031>>హరీశ్ రావు<<>> చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ ఖండించారు. ‘హరీశ్ రావు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం పోరాడుతూనే ఉంది. ఇప్పటికే దానిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. అది జనవరి 5న విచారణకు రానుంది. కేంద్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా.. DPR కూడా సిద్ధం చేయకుండా APని అడ్డుకుంది’ అని తెలిపారు.