News March 24, 2025

తిరుపతి జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి.?

image

రాష్ట్రంలో త్వరలో మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధం అవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. మాజీ MLA సుగుణమ్మ, మాజీ మంత్రి పరస్సా రత్నం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి, సత్యవేడు నుంచి TDP తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ హేమలత, తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం పని చేశామని ఈ సారైనా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుగోపాల్

image

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా.వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

News November 8, 2025

శ్రీవారి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందంటే..?

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తొలి సేవ ‘సుప్రభాతం’. ఇది ఉ.3 గంటలకు జరుగుతుంది. స్వామివారిని మేల్కొలిపే దివ్య ఘట్టమిది. పవిత్ర మంత్రాలు, శ్లోకాలు, మధుర నాదాలతో అర్చకులు స్వామివారిని నిదురలేపి, నిత్య కైంకర్యాలకు ఆహ్వానిస్తారు. ఈ సేవతోనే రోజు ప్రారంభమవుతుంది. ఈ సేవకు ఎంపికైన భక్తులకు స్వామివారిని <<17956589>>అతి దగ్గరి నుంచి<<>>(10Ft) దర్శించుకునే మహాభాగ్యం లభిస్తుంది. ☞ మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 8, 2025

M.T.U 1121.. పచ్చి బియ్యానికి అనుకూలం

image

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి రైతులచే ఎక్కువగా సాగు చేయబడుతున్న రకం M.T.U 1121( శ్రీ ధృతి). దీని పంట కాలం 120-125 రోజులు. గింజ మధ్యస్త సన్నంగా ఉంటుంది. ఇది చేనుపై పడిపోకుండా అగ్గి తెగులును, దోమ పోటును తట్టుకుంటుంది. మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం. గింజ రాలిక తక్కువగా ఉంటుంది. పచ్చి బియ్యానికి ఈ రకం అనుకూలం. దిగుబడి ఎకరాకు సుమారు 3.5 టన్నులుగా ఉంటుంది.