News December 30, 2025

తిరుపతి జిల్లాలో నౌకల తయారీ కేంద్రం

image

మీరు చదివింది నిజమే. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు తిరుపతి జిల్లాకు రానుంది. మనకూ ఓ పోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలోనే ఉంచారు. ఆ రెండు మండలాల పరిధిలో దుగరాజపట్నం పోర్ట్ నిర్మిస్తారు. ఇక్కడే షిప్ బిల్డింగ్ స్కీం కింద నౌకల తయారీ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నిన్నటి క్యాబినెట్ సమావేశంలో వెల్లడించారు.

Similar News

News December 30, 2025

Z: లోన్ తియ్.. ట్రిప్ వెయ్.. రిపీట్!

image

gen-Zలు గొప్పలకై అప్పులు చేస్తున్నారని హెల్తియన్స్ సర్వే వెల్లడించింది. 2025లో లోన్స్ తీసుకున్న 27% gen-Zల మెయిన్ రీజన్ ట్రిప్స్, కన్సర్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్. R2: కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్, బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. R3: ఫోన్స్, ల్యాపీ, స్మార్ట్ వాచ్ వంటి టెక్ థింగ్స్. ఇంకో ట్రెండ్.. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా టెక్కులు, సోకుల కోసం Zలు లోన్ సైకిల్‌లో తిరుగుతున్నారు.

News December 30, 2025

పాలకొల్లు ఉపాధ్యాయునికి ‘గురు చైతన్య’ పురస్కారం

image

పాలకొల్లు: పట్టణంలోని జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని జి.నందిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లాకు ఏడుగురు చొప్పున ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. మోదీ తీవ్ర ఆందోళన

image

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశారు. శాంతి నెలకొనాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు శాంతి యత్నాలను దెబ్బతీస్తాయన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. అయితే పుతిన్ నివాసంపై తాము దాడి చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు.