News September 10, 2025

తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన పూర్వపు ఈవో

image

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును బదిలీపై వెళ్తున్న పూర్వపు ఈవో శ్యామలరావు బుధవారం ఛైర్మన్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోగా పదవీకాలంలో తనకు అన్ని విధాల సహకరించిన బిఆర్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ శ్యామల రావును శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. తర్వాత కాసేపు ముచ్చటించారు.

Similar News

News September 10, 2025

HYD: పోటెత్తిన వరద.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

image

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో బుధవారం గేట్లు తెరిచారు. హిమాయత్‌సాగర్‌ ఒక గేటు ఎత్తి 671 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు. ఉస్మాన్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగులు, గండిపేట పూర్తి స్థాయి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.15 అడుగుల నీరుంది.

News September 10, 2025

గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: కలెక్టర్

image

బుద్ధారం గురుకుల బాలికల కళాశాలను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాన్ని బోధించి వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు.

News September 10, 2025

HYD: పోటెత్తిన వరద.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

image

ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో బుధవారం గేట్లు తెరిచారు. హిమాయత్‌సాగర్‌ ఒక గేటు ఎత్తి 671 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు. ఉస్మాన్‌సాగర్‌ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు విడుదల చేశారు. హిమాయత్‌సాగర్‌ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగులు, గండిపేట పూర్తి స్థాయి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.15 అడుగుల నీరుంది.