News July 8, 2024
తిరుపతి: డిప్లొమా కోర్సులకు దరఖాస్తు

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో అనిమల్ హస్బెండరీ (ఏహెచ్) పాలిటెక్నిక్ డిప్లొమా రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సుకు ఆన్ లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెంగల్రాయులు ఒక ప్రకటనలో తెలిపారు. SSC లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు సోమవారం నుంచి వర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.
Similar News
News February 1, 2026
జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News February 1, 2026
CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.
News February 1, 2026
చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.


