News December 29, 2025

తిరుపతి నుంచి గూడూరు ఔట్.. కానీ!

image

గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను మాత్రమే నెల్లూరులో కలిపారు. చిట్టమూరు, వాకాడు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి. వాకాడులో దుగరాజపట్నం పోర్ట్ కారణంగానే ఆ మండలాన్ని తిరుపతిలో కొనసాగించనున్నారు. చిట్టమూరు సైతం తిరుపతికి దగ్గరగా ఉంటుంది.

Similar News

News December 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి చేయలేదు: ఉక్రెయిన్

image

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడికి <<18706923>>యత్నించారన్న<<>> రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఖండించారు. అంతా అబద్ధమని, ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను సమర్థించుకునే కల్పితకథ అని మండిపడ్డారు. ‘ట్రంప్ టీమ్‌తో కలిసి మేం సాధించిన దౌత్య ప్రయత్నాల విజయాలను దెబ్బతీసేందుకు రష్యా ప్రమాదకర ప్రకటనలు చేస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తోంది’ అని ఆరోపించారు.

News December 30, 2025

మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్‌తో కలిసి బైక్‌పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.