News April 12, 2025

తిరుపతి ప్రజలకు గమనిక 

image

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే  ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News September 14, 2025

నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా: మోదీ

image

తనపై వచ్చే విమర్శలపై ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేను శివ భక్తుడిని.. విమర్శల విషాన్ని దిగమింగుతా. అస్సాం పుత్రుడు, భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది. 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. వాటిని అస్సాం ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News September 14, 2025

MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News September 14, 2025

గద్వాల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నియామకంపై చర్చలు

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ గద్వాల ఇన్‌ఛార్జ్‌ని ప్రకటించకపోవడంతో క్యాడర్ కొంతమేర నిరాశకు గురైంది. నిన్న జరిగిన సభలో ఇన్‌ఛార్జ్‌ని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అన్నీ తానై పార్టీని చూసుకుంటున్న బాసు హనుమంతు నాయుడిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారని భావించినా నిరాశ ఎదురయింది.