News February 14, 2025
తిరుపతి: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
బాపట్ల: ఫుల్లుగా తాగి బీరు బాటిల్తో దాడి

విజయవాడలో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. చీరాలకు చెందిన ప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ పనుల నిమిత్తం ఇక్కడ గదిని అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఇంటి యజమాని బంధువైన షౌకత్ అలీ ఖాన్ అక్కడికి వచ్చి, మా మేనత్త ఇంట్లో నువ్వెందుకు ఉంటున్నావు అంటూ గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న షౌకత్, ప్రసాద్పై బీరు సీసాతో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 25, 2026
మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News February 25, 2026
BIG BREAKING: నాగర్కర్నూల్ ఘటన.. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకటన

నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతర ఘటనలో నేరస్థులైన ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. A1-ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, A2-మధు రెడ్డి, A3-శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. రెండు నెలల చిన్నారి మృతదేహం పోస్టుమార్టం రిపోర్ట్లో అంతర్గతంగా, బహిర్గతంగా ఎలాంటి గాయాలు లేవని నివేదిక వచ్చిందని, RFSL రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.


