News April 24, 2025
తిరుపతి: బాలికపై అత్యాచారం

తిరుపతిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు CI మురళీ మోహన్ తెలిపారు. చెర్లోపల్లికి చెందిన రవి కుమార్, సాయి స్నేహితులు. వారికి తిరుపతికి చెందిన 16 ఏళ్ల బాలికతో పరిచయం ఉంది. ఆమె సాయితో వెళ్లిపోయింది. చెర్లోపల్లి వద్ద నిందితులు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.
Similar News
News April 24, 2025
కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 44.7°C నమోదు కాగా, మానకొండూర్ 44.6, జమ్మికుంట 44.5, రామడుగు 44.4, చొప్పదండి 44.2, కరీంనగర్ 44.1, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్ 44.0, వీణవంక, గంగాధర 43.9, శంకరపట్నం 43.4, గన్నేరువరం 43.3, కొత్తపల్లి, ఇల్లందకుంట 43.1, హుజూరాబాద్ 42.4, సైదాపూర్ 41.9°C గా నమోదైంది.
News April 24, 2025
NGKL: ఇంటర్ విద్యార్థి సూసైడ్ !

తల్లిదండ్రులు మందలించారని ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన NGKL జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. తెల్కపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్కులు ముఖ్యం కాదని విద్యార్థులకు తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలని నిపుణులు చెబుతున్నారు.
News April 24, 2025
అంబేడ్కర్ కోనసీమ: ఆలోచింప చేస్తున్న చిత్రం

చిన్నపిల్లలు, యువకులు, పెద్దలు అంతా సెల్ఫోన్కు బానిసలుగా మారారు. తద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థి దశలో సెల్ఫోన్ వ్యసనంగా మారింది. టీచర్స్, పేరెంట్స్ను సైతం లెక్కచేయక తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. బుధవారం సెల్ఫోన్కు బానిసగా బారిన స్టూడెంట్ టీచర్పై చేయిచేసుకుంది. దీనిపై కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు అంజి ఆకొండి గీసిన చిత్రం ప్రజలను ఆలోచింపజేస్తోంది.