News December 30, 2025
తిరుపతి మధ్యలో బస్టాండ్ ఎందుకు…?

తిరుపతి బస్టాండ్ను రీమోడల్ చేయనున్నారు. ఇది సిటీ మధ్యలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. భక్తులు, వైద్యం, విద్య, వాణిజ్య అవసరాల కోసం వచ్చే వారితో రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ తిరుపతిని దృష్టిలో పెట్టుకుని లోకల్, తిరుమల బస్సులనే ప్రస్తుత బస్టాండ్ నుంచి నడపాలని ప్రజలు కోరుతున్నారు. సుదూర బస్సుల కోసం అవిలాల, అగ్రహారం, తిరుచానూరులో బస్టాండులు నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Similar News
News January 30, 2026
మేడారంలో మంచిర్యాల జిల్లా మహిళ మృతి

మేడారం వనదేవతల చెంత ఘోర ప్రమాదం జరిగింది. జంపన్న వాగు సమీపంలో ట్రాక్టర్ డ్రైవర్కు మూర్ఛ రావడంతో వాహనం అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా ఇందారానికి చెందిన సుగుణ(60) పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే జరిగిన ఈ ప్రమాదంతో జాతరలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
News January 30, 2026
మార్చినాటికి విజయవాడ బైపాస్ పూర్తి: గడ్కరీ

AP: గొల్లపూడి నుంచి చినకాకాని(17.88KM) వరకు చేపట్టిన VJA బైపాస్ MARనాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. లోక్సభలో MP బాలశౌరి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో 4KM మేర మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని మార్చి31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. 2019లో ఈ 6వరసల బైపాస్ నిర్మాణానికి రూ.1,194cr అంచనావ్యయంతో అనుమతులిచ్చారు.
News January 30, 2026
KMR: దొంగ బంగారం అమ్మబోతే దొరికిపోయాడు.. ఖేల్ ఖతం!

దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. SP రాజేష్చంద్ర వివరాలిలా.. గతేడాది పిట్లం, బీర్కూరు పరిధిలో భాస్కర్ బాపూరావు చవాన్ చోరీలకు పాల్పడ్డాడు. ఆ దొంగ సొత్తును మహారాష్ట్ర వాసి ఇర్ఫాన్ నూర్ పాషా పఠాన్కు అమ్మినట్లు వెల్లడైంది. ఇతను HYDలో ఆభరణాలు అమ్మేందుకు రాగా, పట్టుకొని 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు SP వివరించారు.


