News December 7, 2025
తిరుపతి: మరో ప్రొఫెసర్ది అదే డిపార్ట్మెంట్.!

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.
Similar News
News March 9, 2026
ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
News March 9, 2026
12న రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్

మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.
News March 9, 2026
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.


