News April 12, 2025
తిరుపతి: మామా.. నా రిజల్ట్ చూడు రా..!

తిరుపతి జిల్లాలో 62,760 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్లో 32,213మంది, సెకండియర్లో 30,548 మంది ఫలితాలు రానున్నాయి. గతంలో హాల్టికెట్లతో నెట్ సెంటర్లకు వెళ్లగా.. నేడు అందరూ ఫోన్లు చేతపట్టుకుని వేయిట్ చేస్తున్నారు. ‘మామా.. నీకు సిగ్నల్ బాగుంటే నా రిజల్ట్ కూడా చూడు’ అంటూ పట్టణాల్లో ఉండేవారికి పల్లెటూరి విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు.
☞ వే2న్యూస్ యాప్లో వేగంగా ఫలితాలు చూసుకోవచ్చు.
Similar News
News January 2, 2026
చెల్లింపులన్నీ UPIలోనే.. ఏకంగా ₹300 లక్షల కోట్లు

UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు. UPI చరిత్రలో ఇదే అత్యధికం. సగటున రోజుకు 698 మిలియన్ల డిజిటల్ పేమెంట్లు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 228.3B ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹299.7 లక్షల కోట్లు కావడం గమనార్హం. 2024 కంటే సుమారు 33% ఎక్కువ.
News January 2, 2026
ధనుర్మాసం: పద్దెనిమిదో రోజు కీర్తన

‘ఏనుగు వంటి బలమున్న నందగోపుని కోడలా! సుగంధభరిత కేశాలు కల నీళాదేవి! కోళ్లు కూస్తున్నాయి, కోకిలలు గానం చేస్తున్నాయి. నీవు కృష్ణుడితో సరస సంభాషణల్లో మునిగి మమ్మల్ని మరువకు. మీ మధ్య వాదన వస్తే మేము నీ పక్షమే వహిస్తాం. నీ గాజులు ఘల్లుమనేలా నడచి వచ్చి, నీ ఎర్రని తామరల వంటి చేతులతో తలుపులు తీయమ్మా!’ అని వేడుకుంటున్నారు. ఇక్కడ తలుపులు తీయడమంటే భక్తుడికి, భగవంతుడికి మధ్య అడ్డుతెరలను తొలగించడం! <<-se>>#DHANURMASAM<<>>
News January 2, 2026
KMR: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి సబ్ డివిజన్లో 117 కేసులు, బాన్సువాడ సబ్ డివిజన్లో 70 కేసులు, ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో 55 కేసులు నమోదు అయినట్లు జిల్లా SP రాజేష్ చంద్ర వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


