News March 20, 2024

తిరుపతి రీజియన్‌లో BOB 3 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం

image

భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో రాయచోటి, వీరబల్లి, జమ్మలమడుగులో (50, 51, 52 వ బ్రాంచీలు) 3 కొత్త బ్రాంచ్ కార్యాలయాలను NDGM-1 గోవింద్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. AGM & రీజినల్ హెడ్ P.అమరనాథ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ B.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తమ సేవలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు.

Similar News

News March 31, 2025

చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

News March 30, 2025

మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

image

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

News March 30, 2025

చిత్తూరు: రేషన్ ఈ-కేవైసీకి గడువు పెంపు

image

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్  తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.

error: Content is protected !!