News March 20, 2024

తిరుపతి రీజియన్‌లో BOB 3 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం

image

భారతదేశంలోని 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజియన్ లో రాయచోటి, వీరబల్లి, జమ్మలమడుగులో (50, 51, 52 వ బ్రాంచీలు) 3 కొత్త బ్రాంచ్ కార్యాలయాలను NDGM-1 గోవింద్ ప్రసాద్ వర్మ ప్రారంభించారు. AGM & రీజినల్ హెడ్ P.అమరనాథ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ B.ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. తమ సేవలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరిస్తామని తెలిపారు.

Similar News

News January 3, 2026

చిత్తూరు: రేషన్ సరకుల కోసం ఆందోళన.!

image

బియ్యం అందరికీ ఇచ్చేవరకు రేషన్ షాప్ తెరవొద్దని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలసముద్రం మండలం మణిపురం చౌకదుకాణం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ గుర్రప్ప నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

News January 2, 2026

చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

image

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.