News October 23, 2025
తిరుపతి: రేపు స్కూళ్లకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అనగా 23వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ (Unaided) పాఠశాలలకు, అంగన్ వాడీలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. డివైఈఓలు, ఎంఈఓలు, HMలు తమ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేయవలసిందిగా ఆదేశించారు.
Similar News
News October 23, 2025
NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.
News October 23, 2025
మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు తెలిపారు.
News October 23, 2025
12 వేల మంది పోలీసుల భద్రత వలయంలో మేడారం..!

మేడారం మహా జాతరలో ఎన్ని ప్రభుత్వ శాఖలు పనిచేసినా పోలీసు డిపార్ట్మెంట్దే ప్రధాన పాత్ర. శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతరను జరిపించడంలో ఖాకీలే కీలకం. సమ్మక్క, సారలమ్మలను గద్దెకు చేర్చే ఘట్టం యావత్ జాతరకే హైలెట్. ట్రాఫిక్ క్లియరెన్స్, దొంగతనాల నియంత్రణ అతి పెద్ద టాస్క్లు. ఇలాంటి క్లిష్టమైన విధుల్లో ఉండే పోలీసులు ఈసారి 12 వేల మంది జాతర విధుల్లో భాగస్వాములు కానున్నారు.