News March 6, 2025
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తెలంగాణ, వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి వద్ద హైవే 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి పట్టణ కేంద్రానికి చెందిన రామయ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో బంధువుల ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలై రామయ్య(58) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి.
Similar News
News December 12, 2025
దోనేపూడి ప్రమాదం.. మృతులు వీరే!

కొల్లూరు మండలం <<18543680>>దోనేపూడి <<>>గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భట్టిప్రోలు వాసులు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన చత్రగడ్డ కాంతారావు, పెసరలంక శ్రీనివాసరావు వెల్లలూరు గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ అనే ముగ్గురు మృతి చెందారని అధికారులు ధ్రువీకరించారు. అదేవిధంగా సమ్మెట పోతురాజు, సమ్మెట గణేష్ అనే ఇరువురు గాయపడి తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
News December 12, 2025
నిజామాబాద్: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నిక గురువారంతో ముగిసింది. రెండో విడతలో భాగంగా ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముగ్పాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.
News December 12, 2025
తిరుపతిలో అంగన్వాడీల భారీ ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. తమకు అందుతున్న వేతనాలు సరిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీతం పెంచాలని.. అర్హులైన వారికి అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది ధర్నాకు వెళ్లడంతో పలుచోట్ల అంగన్వాడీలు మూతపడ్డాయి.


