News September 22, 2024

తిరుపతి : విదేశాల్లో ఉద్యోగావకాశం

image

APSSDC ఆధ్వర్యంలో నర్సింగ్ అభ్యర్థులకు జపనీస్ భాష నేర్పించి అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖాధికారి లోకనాధం ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్, ANM, GNM పూర్తిచేసి 18-32 సంవత్సరాల్లోపు మహిళలు అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://shorturl.at/FB7ok వెబ్‌సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 2, 2025

చిత్తూరు: వారికి రేపు పింఛన్ల పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో తొలిరోజే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 95.20 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2,67,786 మంది లబ్ధిదారులు ఉండగా 2,54,943 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛను సొమ్ము అందజేశారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో మిగిలిన 12,843 మందికి సోమవారం పింఛన్ ఇవ్వనున్నారు.

News November 2, 2025

చిత్తూరు: ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

image

చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని.. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

News November 2, 2025

పుత్తూరు: ‘ప్రభుత్వ వైఫల్యం వల్లే తొక్కిసలాట’

image

కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో ఆయన శనివారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద 9 మంది తొక్కిసాలాటలో మరణించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య ప్రజలకు, భక్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.