News January 12, 2026
తిరుపతి: శెట్టిపల్లి లబ్ధిదారులకు సంక్రాంతి బోనస్

తిరుపతి జిల్లా సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. తుడా అథారిటీ ద్వారా కేటాయించే మొత్తం 286.83 ఎకరాల భూమికి సంబంధించిన అన్ని కన్వేయన్స్ డీడ్లపై స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు రూ.16.25 కోట్ల వరకు ఆర్థికభారం తగ్గనుందని అధికారులు అంచనా వేశారు.
Similar News
News February 7, 2026
HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

HYD ఐఐఐటీలోని ఐహబ్-డేటా మహిళా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్ లెర్నింగ్ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 7, 2026
VZM: మార్చి 31లోగా ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనులు మార్చి 31లోగా పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉపాధి హామీ పనులపై కమీషనర్ సమీక్షించారు. తక్కువ పురోగతి ఉన్న గంట్యాడ, వేపాడ, గరివిడి, గజపతినగరం, జామి మండలాలు మార్చి 15లోగా పనులు పూర్తి చేసి బిల్లులు అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
News February 7, 2026
KNR: ఎన్నికల వేళ.. ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలోని ఆర్టిస్టులకు ఉపాధి లభిస్తోంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరిట ఆర్టిస్టులు ప్లకార్డులు రూపొందిస్తున్నారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా కార్యకర్తలు చేతిలో పట్టుకునే విధంగా థర్మాకోల్ బోర్డుపై అభ్యర్థుల పేర్లను, గుర్తులను అందంగా రాస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆకర్షనీయంగా కనిపిస్తున్న ప్లకార్డుల తయారీతో ఆర్టిస్టులకు ఉపాధి పెరిగిందని చెప్పవచ్చు.


