News July 5, 2024

తిరుపతి సమస్యలను తీరుస్తా: మంత్రి దుర్గేశ్ 

image

రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Similar News

News July 8, 2024

నగరి : YSRకు నివాళులు అర్పించిన ఆర్కే రోజా

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. రాష్ట్ర చరిత్రలోనే 108 అంబులెన్స్ ప్రవేశపెట్టి రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమందికి పునఃజన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.

News July 8, 2024

తిరుపతి: డిప్లొమా కోర్సులకు దరఖాస్తు

image

ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో అనిమల్ హస్బెండరీ (ఏహెచ్) పాలిటెక్నిక్ డిప్లొమా రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సుకు ఆన్ లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెంగల్రాయులు ఒక ప్రకటనలో తెలిపారు. SSC లేదా తత్సమాన పరీక్ష పాసైన విద్యార్థులు సోమవారం నుంచి వర్సిటీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 27వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.

News July 8, 2024

మదనపల్లెలో భార్యపై కత్తితో దాడి

image

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరీ నగర్లో ఉండే ఎస్.ఆర్.దుర్గ (28), కే.భాస్కర్ నాయుడుకు ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో కొడుతూ వుండేవాడు. రాత్రి కత్తితో దాడి చేయగా దుర్గ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.