News October 2, 2024
తిరుపతి: స్వర్ణాంధ్ర 2047@ విజన్ ను ప్రణాళికలు సిద్ధం

జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా సర్ణాంధ్ర @ 2047 విజన్ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ స్వర్ణాంధ్ర@ 2047 అమలుపై ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, జిల్లా అధికారులతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News January 30, 2026
కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.
News January 29, 2026
చిత్తూరు: ఫిబ్రవరి 4వ వరకే ఛాన్స్.!

చిత్తూరు జిల్లాలో 4 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. 2025-28 సం.గాను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 5వ తేదీన కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు https://oc.hpfsproject.com వెబ్ సైట్ చూడాలన్నారు.
News January 29, 2026
CM సభకు అక్రిడేషన్ కలిగిన రిపోర్టర్లకే అనుమతి

కుప్పంలో ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీఎం చంద్రబాబు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో 31న నిర్వహించే బహిరంగ సమావేశానికి అక్రిడేషన్ కలిగిన విలేకరులకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా సమాచార శాఖ అధికారులు గురువారం స్పష్టం చేశారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించ వచ్చని వెల్లడించారు.


