News February 5, 2026
తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పింక్ బస్సు సేవలు

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏర్పాటైంది. 2 పింక్ బస్సుల ద్వారా గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి సేకరించే నమూనాలను స్విమ్స్లో పరీక్షలు చేస్తున్నారు. 730 క్యాంపులు నిర్వహించి 42,609 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి 3,226 మందిని అనుమానితులుగా గుర్తించారు. ప్రస్తుతం 759 మంది వైద్య చికిత్స పొందుతున్నారు.
Similar News
News February 6, 2026
421 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 421 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/
News February 6, 2026
KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు: రేవంత్

TG: రూ.లక్ష కోట్లతో కట్టిన ‘కాళేశ్వరం’ మూడేళ్లలో కూలిపోయిందని CM రేవంత్ విమర్శించారు. గోదావరి జలాల పేరుతో కల్వకుంట్ల కుటుంబం TGని దోచుకుందని ఆరోపించారు. BJPకి అధికారం ఇస్తే KCRను జైల్లో వేస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. జైల్లో KCR చిప్పకూడు తినకుండా అడ్డుకుంటోంది ఎవరు? అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే ఎక్కువ నిధులు వస్తాయని NZB సభలో తెలిపారు.
News February 6, 2026
ఖమ్మం: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‘రాయ’బారమేదీ?

ఏదులాపురం పుర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గైర్హాజరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పాలేరులో పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, వందలాది గ్రానైట్ పరిశ్రమలున్న ఈ మున్సిపాలిటీలో అంటీముట్టనట్లు ఉండటం వెనుక మంత్రి పొంగులేటి శిబిరం నుంచి పిలుపు అందకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు చర్చించుకుంటున్నారు.


