News November 5, 2025
తిరుపతి: హాస్టల్లో విద్యార్థులపై లైంగిక దాడి.?

తిరుపతిలోని ఓ బాలుర హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురుపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3న ఓ బాలుడు ఈ విషయాన్ని పేరంట్స్కు ఫోన్ ద్వారా చెప్పగా వెంటనే వారు వార్డెన్కు సమాచారం ఇచ్చారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు పోక్సో, SC, ST యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News April 5, 2026
చిత్తూరు: ఇలా అయితే కొత్త ఇళ్లు కట్టినట్లే.!

యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. చిత్తూరు జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇనుము టన్నుకు రూ.10 వేలు, సిమెంటు బస్తా రూ.30 మేర పెరిగింది. అలాగే కేబుల్ ధరలు పెరిగిపోయాయి. పీవీసీ పైపుల ధరలు సుమారు 30 శాతం మేర పెరిగాయి. పెయింటింగ్ ధరలను కంపెనీలు పెంచేశాయి. వేసవిలో నిర్మాణ పనులు అధికంగా చేపడతారు. పెరిగిన ధరలు వారిపై భారం మోపునున్నాయి.
News April 5, 2026
రామప్ప ప్రాంగణంలో కామేశ్వరాలయం పునరుద్ధరణకు శ్రీకారం

ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయ సముదాయంలో ఉన్న కామేశ్వరాలయం పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు ప్రారంభించింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దాదాపు రూ.6.86 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తికి చేరుకుంది. ఆలయంలోని శిల్పాలు, నిర్మాణ భాగాలను సంరక్షించనున్నారు.
News April 5, 2026
కొండగట్టు అంజన్నకు రూ.1.63 కోట్ల ఆదాయం!

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.


