News February 20, 2025

తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2025

చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

News February 21, 2025

22న కుప్పానికి హైపర్ ఆది రాక 

image

ప్రముఖ బుల్లితెర నటుడు హైపర్ ఆది ఈనెల 22న కుప్పంకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కుప్పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌ డే వేడుకలలో పాల్గొననున్నట్లు ఆది తెలిపారు. కుప్పం పర్యటన కోసం తాను ఎదురు చూస్తున్నానని, 22న కుప్పంలో కలుద్దామంటూ ఆది పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమానికి ఆదితోపాటూ, మరో నటుడు రాంప్రసాద్ సైతం వస్తున్నారు. 

News February 20, 2025

చిత్తూరు జిల్లాలో ఇవాల్టి ముఖ్య ఘటనలు

image

✒ చిత్తూరు జిల్లాలో పబ్లిక్ పరీక్షలపై కలెక్టర్ కీలక ఆదేశాలు
✒ 22న కుప్పానికి హైపర్ ఆది రాక
✒ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం: కుప్పం DSP
✒ కార్వేటినగరంలో ముగ్గురి అరెస్ట్
✒ తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
✒ చిత్తూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
✒ తిరుపతి-పీలేరు హైవేపై రెండు కార్లు ఢీ
✒ జీడీ నెల్లూరు MRO ఆఫీసులో తనిఖీలు

error: Content is protected !!