News June 12, 2024

తిరుపతి: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ, మరో వ్యక్తి మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న కుటుంబంగా భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

నేడు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

News March 1, 2026

చౌడేపల్లి: చిరుత దాడిలో దూడ మృతి

image

చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు. చిరుత పులి దాడి నుంచి పశువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

News March 1, 2026

PGRSను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. ఉదయం10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.