News February 6, 2026
తిరుపతి: 32మంది విద్యార్థుల డీబార్

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో శుక్రవారం డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. వివిధ పరీక్షా కేంద్రాల్లో హైపవర్ ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేపట్టింది. చూసిరాస్తూ(మాల్ ప్రాక్టీస్) 32 మంది పట్టుబడగా.. వారందరినీ డీబార్ చేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కు పాల్పడరాదన్నారు.
Similar News
News February 14, 2026
అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

హైదరాబాద్ వేదికగా ఐఎల్ఎహెచ్ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.
News February 14, 2026
కేశవ్ చేతిలో ఖజానా.. జిల్లాపై కరుణ చూపిస్తారా?

‘వడ్డించేవాడు మనోడు అయితే.. కడబంతిలో కూర్చున్నా అన్నీ వస్తాయి’ అన్నట్లు బడ్జెట్ సమావేశాలపై అనంతపురం జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లా వాసి పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి రంగానికి నిధుల వరద పారాలని జనం కోరుకుంటున్నారు. ఈసారి కేటాయింపులు జిల్లా తలరాతను మార్చేలా, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసేలా ఉండాలని సామాన్యులు ఆశిస్తున్నారు.
News February 14, 2026
NZB: 18 నుంచి 14కు తగ్గిన MIM సీట్లు

2020లో నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 18 సీట్లను గెలుచుకున్న AIMIM 2026 ఎన్నికల్లో 14 సీట్లను గెలుచుకుంది. AIMIM అభ్యర్థులు పోటీ చేసిన కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత పాలక వర్గంలో ఉన్న షకీల్ హైమద్, మహ్మద్ ఇద్రీస్ ఖాన్లు వరుసగా 52, 55వ డివిజన్లలో గెలుపొందడం గమనార్హం.


