News June 16, 2024
తిరుపతి: 578 కేసులు.. రూ.12.93 లక్షల జరిమానా

విద్యుత్తు అక్రమ వినియోగంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3,095 సర్వీసులు తనిఖీ చేసి.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 578 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేశారు. రూ.12.93 లక్షల జరిమానా విధించామని ఉన్నతాధికారులు తెలిపారు.
Similar News
News February 28, 2026
పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం 197. రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 89.76% పెన్షన్లు పూర్తి చేశామన్నారు. మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. పెన్షన్ లబ్ధిదారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.
News February 28, 2026
తిరుపతిలో బస్సుల దారి మళ్లింపు

తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి తిరుమల బైపాస్ రోడ్డు, అలిపిరి, టౌన్ క్లబ్ మీదుగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.


