News February 1, 2025

తిరుపతి: 95.68 శాతం పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శనివారం 95.68 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 97.12 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ తొలి స్థానంలో ఉండగా.. 93.2 శాతంతో వాకాడు చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తిరుపతి జిల్లా 95.68 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది.

Similar News

News February 1, 2025

5న క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాలు

image

TG: ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనుంది. క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశం నిర్వహించి వీటిని సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలపైనా సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. అటు రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక అందనుంది.

News February 1, 2025

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టండి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాఠశాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలకు చేసే రాకపోకలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

News February 1, 2025

వరంగల్: ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 చిన్నారులకు విముక్తి

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.