News January 26, 2025

తిరుపతి: TTD రూ.27 లక్షల పరిహారం చెల్లింపు

image

తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు శనివారం అందజేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు. మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్‌ను అందించారు.

Similar News

News September 15, 2025

వనపర్తి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాల్లో సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 135.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గణపూర్ 105.0 మి.మీ, గోపాల్‌పేట 104.0 మి.మీ, పెద్దమందడి 100.0 మి.మీ, వనపర్తి, పెబ్బేరు 73.0 మి.మీ, ఏదుల 68.0 మి.మీ, పాన్‌గల్ 64.0 మి.మీ, కొత్తకోట 52.0 మి.మీ, మదనాపూర్ 44.0 మి.మీ, వీపనగండ్ల 40.0 మి.మీ, చిన్నంబావి 33.0 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది.

News September 15, 2025

NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

image

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.

News September 15, 2025

కొడికొండ వద్ద మెగా పారిశ్రామిక జోన్

image

శ్రీ సత్యసాయి జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. కొడికొండ చెక్‌పోస్టు సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు కేటాయించిన భూములు సహా 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ వంటి 16 కేటగిరీల పరిశ్రమల ఏర్పాటు కోసం జోన్లుగా విభజించి మాస్టర్‌ ప్లాన్ తయారీ బాధ్యతలను లీ అండ్ అసోసియేట్స్ సంస్థకు అప్పగించింది.